పద్మనాయక వెలమల ఆవిర్భావం
దానిలో మొదటి దాని ప్రకారం పద్మనాయకులు క్షత్రియులు అని, పరశురాముడు క్షత్రియులు అందరిని నిర్జిస్తుండగా వారు తమ జంధ్యాలు తీసివేసి తాము పద్మనాయకులు అని చెప్పుకుని దక్షిణా పథానికి వచ్చారు అని అంటారు.
రెండవ దాని ప్రకారం పద్మనాయకులు మహాపద్మ నందుడు కి ఒక శూద్ర స్త్రీతో జన్మించినవారు అని, మహాపద్మ నందుడిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన తరువాత వీరిని కూడా చంపడానికి వెంట పడగా వారు దక్షిణా పథానికి వచ్చి పద్మనాయకులు అయ్యారు అని అంటారు.
మూడవ దాని ప్రకారం పద్మనాయకులు కొండ అవతల (అంటే వింధ్య పర్వతాల అవతల) నివసించేవారని, వారిని వింద్జ్య పర్వతాల అవతల నుండి దక్షిణా పథానికి బహిష్కరించడం వలన అక్కడికి వలస వచ్చి వెలమలు (వెలి అంటే కొండ, మల అంటే అవతల అంటే కొండ అవతల) అయ్యారు అని అంటారు.
మన దగ్గర చారిత్రక ఆధారాలు లేకుండా ఏ విషయం నమ్మడానికి లేదు. అందుచేత ఈ మూడు కూడా నమ్మటం సరి కాదు.
కానీ ఈ మూడు ఇతిహాసాలు కూడా వెలమలు ఉత్తర భారత దేశం నుండి వచ్చినవారు అని సూచిస్తున్నాయి. అంటే బహుశా అది నిజం కావడానికి ఆస్కారం ఉంది. కానీ అది కూడా మనం నిశ్చితంగా చెప్పలేము.
వెలమ కులాల మూలాన్ని ఖచ్చితత్వంతో నాటి చెప్పలేము కాని వెలమల గురించిన మొదటి ప్రస్తావన కొండవీడులోని పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి శ్రీనాథుని “పల్నాటి వీరచరిత్ర”లో జరిగింది.
శ్రీనాథుడు 1365-1441 సంవత్సరాలలో జీవించాడు, అయితే వాస్తవానికి పల్నాటి యుద్ధం యుద్ధం 1178 మరియు 1182 సంవత్సరాల మధ్య ఎక్కడో జరిగింది. అంటే కవి తన కాలానికి 200 సంవత్సరాల కంటే ముందు జరిగిన దాని గురించి వ్రాసాడు.
ఆ తరువాత క్రిస్తు శకం 1199 లో రాజ్యానికి వచ్చిన గణపతిదేవుని కొలువులో పద్మనాయక వెలమలు ముఖ్య పాత్ర పోషించారు.
అలాగే వారు ఆయన వారసులు ఐన రుద్రమదేవి, ప్రతాపరుద్రుని కొలువులో ముఖ్యపాత్రలు పోషించారు. వారు కాకతీయ సామ్రాజ్య విచ్చిన్నం తరువాత నల్గొండ లోని రాచకొండ రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.
పద్మనాయకులు నల్గొండ జిల్లాలోని పిల్లలమఱ్ఱి ఆమనగల్లు ప్రదేశాల వారు. వారే కాకుండారెడ్లు కూడా అదే ప్రదేశానికి చెందినవారు.
పల్నాటి యుద్ధం ముందు కాలంలో ఉండిన వెలమల గురించి కొన్ని ఊహా గానాలు ఉన్నాయి, కానీ మళ్ళీ మరల వాటికి కూడా ఏమీ చారిత్రక ఆధారాలు లేవు.
పల్నాటి యుద్ధనికి ముందు మనకు రెండు చారిత్రక దృష్టాంతారాలు మట్టుకు దొరుకుతాయి. అవి ఏమిటంటే నలగామరాజు (పల్నాటి యుద్ధం ఫేమ్) పిలుపున కాకతీయ రాజు ఐన కాకతి రుద్రదేవుడు( 1163 -1195
) తన సైన్యంతో మల్యాల , కొమరవెల్లి, విప్పర్ల మరియు నతవాది నాయకులను తీసుకుని సైన్యంతో కోట నాయకుడు ఐన దొడ్డ భీముడిని జయించి ధరణికోటను అతడి నుండి స్వాధీనం చేసుకున్నాడు అని ఉంది. మల్యాల మరియు విప్పర్ల రెండు కూడా పద్మనాయక వెలమ గోత్రాలే.
అంతే కాకుండా పల్నాటి యుద్ధం ముందు ఉన్న వెలనాటి గొంకరాజు మంత్రి దొడ్డ నాయుడు(బ్రహ్మనాయుడి తండ్రి) రేచెర్ల పద్మనాయకుడు. ఆంటే అప్పటికే పద్మనాయకులు స్థిరపడి నాయక లక్షణాలు కలిగి ఉన్నారు. అది కేవలం ఒక తరం లో అయ్యే పని కాదు. దానిని బట్టి అంతకు ముందు కూడా పద్మనాయకులు స్థిరపడి ఉన్నారు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. కానీ దానికి ఏమీ చారిత్రక ఆధారాలు మట్టుకు లేవు.
పల్నాటి యుద్ధం తరువాత గణపతిదేవుని పరిపాలనలో మళ్ళీ మనకు పద్మనాయకులు తగులుతారు. మొదటిగా రేచెర్ల రుద్రుడు, ఆయన గణపతిదేవుని ముఖ్య సేనాధిపతి. కానీ అయన పద్మనాయకుడా లేక రెడ్డి నా అన్నది స్పష్టంగా తెలియదు కానీ ఎక్కువ మంది చరిత్రకాలు అయన రెడ్డి అనే నమ్ముతారు.
కానీ వెలుగోటివారి వంశావళి లో ఆయన పద్మనాయకుడు అని చెప్పబడింది. రెడ్ల లో కూడా రేచెర్ల గోత్రం ఉంది. పైగా దానికి తోడు వారు కూడా పద్మనాయకుల లాగే నల్గొండ లోని పిల్లలమఱ్ఱి, ఆమనగల్లు ప్రదేశం నుండి వచ్చినవారే. కానీ రేచెర్ల రుద్రుడు రెడ్డి అని చెప్పడానికే ఎక్కువ ఆస్కారం ఉంది ఎందుకంటే ఒక శాసనంలో అయన వంశాన్ని చెప్తూ అయన పూర్వీకులను అందరిని రెడ్డి నామంతో చెప్పారు. వెలమలు ఎవ్వరూ కూడా రెడ్డి నామం ధరించారు అనడానికి మనకు ఒక్క ఉదాహరణ కూడా లేదు.
మనకు కాకతీయ సామ్రాజ్యంలో అందరు చరిత్రకారులు అంగీకరించే పద్మనాయకులు గణపతిదేవుని కాలం లోనే తగులుతారు. అందులో మొట్ట మొదటి వాడు ఎర దాచానాయకుడు, ఆయన తరువాత దామ, రుద్ర, ప్రసాదిత్యనాయకులు. వీరు అందరూ గణపతిదేవుని (1199 -1262
) సైన్యాధిపతులు.
కాకతీయ రాజ్య పతనం అనంతరం రాజ్యం అంతా మహమ్మద్ బీన్ తుగ్లక్ అధీనం అయ్యింది. అయన దాన్ని పాలించడానికి ఓరుగంటిలో ఒక సైన్యాధిపతి ని నియమించాడు. ఆంధ్ర దేశం అంతా ముస్లిం పాలన లో అల్ల కల్లోలం అయిపొయింది.
Comments
Post a Comment