After Anapotanayaka his son Singamanedu II ascended the throne of Rachakonda. He is also known as Kumara Singabhupaludu. Before coming to the throne he captured the fort of Kalyani in Gulbarga district. It appears that he went to Karnataka to help the Bahamani kings and took this fort during the campaign.
Monday, January 13, 2025
RACHAKONDA KINGDOM OF PADMANAYAKA VELAMAS.
Wednesday, January 8, 2025
కూచ్ బీహార్ రాణి కమలాదేవి
ఇంతకు ముందు బరోడా మహారాణి సీతాదేవి గురించి ఒక నోట్ రాసాను. పిఠాపురం రాజా రావు వెంకట సూర్యారావు ఇద్దరు కుమార్తెలలో ఆమె చిన్నది. పెద్ద కుమార్తె కమలాదేవి కూడా భూటాన్కు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్లోని కూచ్ బీహార్లో మరొక రాజకుమారుడిని వివాహం చేసుకుంది.
కూచ్ బీహార్ ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తరాన జల్పైగురి, దక్షిణాన రంగపూర్ జిల్లాలు, తూర్పున భూటాన్ హద్దులుగా కలిగి ఉన్న సంస్థానం.
ఆమె బరోడా యువరాణి ఇందిరా రాజేకు జన్మించిన కూచ్ బీహార్ మహారాజు 2 వ కుమారుడు ఇంద్రజితేంద్ర నారాయణ్ను వివాహం చేసుకుంది.
వాస్తవానికి కమలాదేవి తన చెల్లెలు సీతాదేవి యొక్క ఉద్వేగభరితమైన మరియు ఆకర్షణీయమైన జీవితాన్ని గడపలేదు. ఆమె చిన్న వయస్సులోనే తన భర్తను దూరం చేసిన ఒక విషాదం ఆమెను తాకినప్పటికీ ఆమె జీవితంలో స్థిరంగా ఉంది. ఆమె దురదృష్టవశాత్తు, ఇంద్రజితేంద్ర నారాయణ్ ను 33 సంవత్సరాల వయసులోనే కోల్పోయింది.
ఆమె అత్తగారు మరియు ఇంద్రజితేంద్ర నారాయణ్ తల్లి బరోడా యువరాణి ఇందిరా రాజే. ఇందిరా రాజే వివాహం మొదట్లో గ్వాలియర్కు చెందిన మధో రావ్ సింధియా (మాధవరావు సింధియా తాత)తో నిశ్చయించబడింది, కానీ వివాహం నిశ్చయించబడినప్పుడు ఆమె అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని అతనికి లేఖ రాసింది దానివలన నిశ్చయమైన ఆమె వివాహం రద్దు చేయబడింది.
అప్పటికి ప్రిన్స్లీ హౌస్లలో ఆమె చేసినది చాలా సాహసోపేతమైన చర్య. ఆమె దాని తరువాత కూచ్ బీహార్ రాజా జితేంద్ర నారాయణ్ యొక్క 2వ కుమారుడిని వివాహం చేసుకుంది, అతను తరువాత రాజు అయ్యాడు, ఎందుకంటే అతని అన్నయ్య చిన్న వయస్సులోనే మరణించాడు, తాగుడు అనేది ఆ రాకుమారుల ఇంటి సంప్రదాయం.
జితేంద్ర నారాయణ్ను నిర్లక్ష్యపు ఆటగాడిగా (Playboy) భావించిన ఇందిరా రాజే తల్లిదండ్రులు మొదట ఆ పెళ్లికి అంగీకరించలేదు, కానీ ఇందిరా రాజే మొండిక వేయడంతో, చివరకు అయిష్టంగానే లండన్లో వారి వివాహానికి అంగీకరించారు.
ఆమె మామగారు అయిన జితేంద్ర నారాయణ్ తల్లి రాణి సునీతా దేవి అనుసరించే బ్రహ్మ సమాజం యొక్క ఆచారాల ప్రకారం వారు లండన్లో వివాహం చేసుకున్నారు. సునీతా దేవి మరెవరో కాదు, బెంగాల్కు చెందిన మత సంస్కర్త కేశుబ్ చంద్ర సేన్ కుమార్తె.
ఈ వివాహానికి ఇందిరాదేవి బంధువులు ఎవరూ హాజరుకాలేదు. ఆమె భర్త జితేంద్ర నారాయణ్ కూడా చిన్న వయస్సులోనే మరణించాడు. ఇందిరా దేవి తన పెద్ద కొడుకు మెజారిటీ వచ్చే వరకు రాష్ట్ర వ్యవహారాలను చూడవలసి వచ్చింది.
ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు, వారిలో ఇంద్ర జితేంద్ర నారాయణ్ చిన్నవాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, వీరిలో పెద్దది ఇల, త్రిపుర యువరాజును వివాహం చేసుకుంది. ఆమె కుమారుడు నటి మూన్ మూన్ సేన్ను వివాహం చేసుకున్నాడు. తర్వాతిది గాయత్రీ దేవి జైపూర్ మహారాజ్ సవాయి మాన్ సింగ్ II ని వివాహం చేసుకుంది మరియు ఆమె చాలా ఆకర్షణీయమైన యువరాణి. మూడవది దేవాస్ మహారాజును వివాహం చేసుకున్న మేనక.
నేను కూచ్ బీహార్ ప్యాలెస్, మరియు కమలాదేవి మరియు ఆమె భర్త ఇంద్రజితేంద్ర నారాయణ్ని చూపిస్తున్న చిత్రాన్ని క్రింద ఇస్తున్నాను.
బరోడా మహారాణి సీతాదేవి
కాకినాడ పక్కనే ఉన్న పక్కనే ఉన్న పిఠాపురానికి చెందిన ఒక ప్రిన్సెస్, తన జీవితం ఎంతో వేగంగా జీవించి మరణించింది అంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. భారత దేశం లోని ప్రిన్సెస్ కుటుంబాలలో ఈమె సృష్టించిన తరంగాలు మరి ఏ ఇతర ప్రిన్సెస్ కూడా సృష్టించలేదు. కానీ పాపం ఆమె జీవించిన చివరి సంవత్సరాలు పుత్రుని కోల్పోవటంవలన కలిగిన వ్యధతో కూడినవి.
సీతాదేవి 1917లో మద్రాసులో పిఠాపురం రాజా, రావు వెంకట కుమార మహిపతి సూర్యారావు దంపతులకు జన్మించింది.
సీతాదేవి మొదట ఉయ్యూరు జమీందారు, (7 గురు అన్నదమ్ములు ఉండటంవలన 18 పరగణాలు 288 గ్రామాలు కల నూజివీడు ఎస్టేట్ 7 ముక్కలుగా చీల్చబడింది. అందులో ఒకటి ఉయ్యూరు, అది కాక అందులో మీర్జాపురం, కపిలేశ్వర పురం, శనివారపుపేట ఇంకా మూడు ఎస్టేట్ లు ఉన్నాయి. ఇప్పటి గుడివాడ కూడా వారి ఎస్టేట్ లోనిదే.) Andhra University EX VC శ్రీ M R అప్పారావు గారిని వివాహం చేసుకుంది, అయితే ఆమె ఒక SOCIALITE, కానీ MR అప్పారావు గారు దానికి విరుద్ధం. అందుచేత ఆమె ఆయనతో సంతోషం గా ఉండలేకపోయింది. నిజామ్ కోడలు యువరాణి నీలోఫర్ సీతాదేవికి సన్నిహితురాలు. MR అప్పారావు గారితో, ఆమె ఒక కొడుకు విద్యుత్ కుమార్ అప్పారావుకు( Nickname TALLY) కు జన్మనిచ్చింది.
ఆమె 1943లో మద్రాసు రేస్ కోర్స్లో బరోడా మహారాజా ప్రతాప్ సింగ్ రావ్ గైక్వాడ్ను కలిసింది. అప్పుడు అతను ప్రపంచంలోని 8వ అత్యంత సంపన్నుడిగా మరియు భారతదేశంలో నిజాం తరువాత 2 వ అత్యంత సంపన్న రాజుగా పరిగణించబడ్డాడు.
గైక్వాడ్ ను ఆమె మనస్తత్వం పూర్తిగా ఆకర్షించింది. ఆయన పూర్తిగా ఆమె ఆకర్షణ లో పడిపోయాడు. సీతాదేవి కూడా గైక్వాడ్ ని ఇష్టపడింది, బహుశా అది అతని సంపద వల్ల కావచ్చు.అయితే అతనికి అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. అంతేకాదు గేక్వాడ్ తాతగారు వారి రాష్ట్రంలో ఏ పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండకూడదని నిబంధన కూడా పెట్టి ఉన్నారు.
గైక్వాడ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఆమె అప్పటికే వివాహం చేసుకుంది మరియు MR అప్పారావు గారి నుండి విడాకులు అవుతాయి అని ఆమెకు, గైక్వాడ్ కు కూడా నమ్మకం కలగలేదు. కాబట్టి గైక్వాడ్ యొక్క న్యాయవాదుల సూచన మేరకు ఆమె ఇస్లాం మతంలోకి మారింది, దీని ద్వారా ఆమె మునుపటి వివాహం రద్దు చేయబడింది. ఆమె తిరిగి హిందూ మతంలోకి మారి గైక్వాడ్ను వివాహం చేసుకుంది.
అప్పుడు గైక్వాడ్ రాజా బహుభార్యత్వంపై రాష్ట్ర చట్టాన్ని ఉల్లంఘించాడని ఆంగ్లేయులు భావించారు మరియు సంజాయిషీ అడగడం కోసం అతనిని పిలిచారు. కానీ అతను ఆ విషయం పైన బ్రిటిష్ వారిని ఒప్పించగలిగాడు. కానీ బ్రిటిష్ వారు చివరి వరకు ఆమెను మహారాణి అని సంభోదించలేదు. 1946 లో గైక్వాడ్ ఆమెను యూరప్ పర్యటనకు తీసుకువెళ్లారు మరియు వారు మొనాకోలోని మోంటే కార్లోలో ఒక భవనాన్ని కొనుగోలు చేశారు. సీతాదేవి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.
గైక్వాడ్ తరచుగా బరోడాలోని సంపదను మొనాకోకు తీసుకువస్తూ ఆమెను సందర్శించేవాడు. ఈ జంట అమెరికా కు 2 పర్యటనలు చేసారు, అప్పుడు అమెరికా ప్రయాణించడానికి మరియు షాపింగ్ లో వారు 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అది దాదాపు 1950 దగ్గర్లో జరిగింది. అంటే 1 కోటి అమెరికన్ డాలర్ లు. ఇప్పుడు దాని విలువ 82 కోట్ల రూపాయలు.
ఈ జంట బరోడా నిధి నుండి అమూల్యమైన ఆభరణాలను మొనాకో బదిలీ చేసారు (మీరు సీతాదేవి, బరోడా మహారాణిలోని వికీపీడియా పేజీలో వాటి జాబితాను కనుగొనవచ్చు) స్వాతంత్య్రానంతరం మన అధికారులు కొన్ని ఆభరణాలను తిరిగి పొందగలిగారు కానీ మిగిలినవి సీతాదేవికి చేరాయి.
1994లో భారత అధికారులు జెనీవా ఖజానాలో ఒక ముత్యాల తివాచీని తిరిగి పొందగలిగారు. ఈ ముత్యాల తివాచీ ప్రస్తుతం దోహాలోని మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్లో ఉంది. సీతాదేవికి వెళ్లిన స్టార్ అఫ్ ది సౌత్ అనబడే పెద్ద వజ్రం (128.8 carats and in 2005 the cost of one carat of this diamond was estimated to cost 736000 USD which means the current cost of that whole diamond would be Rs 850 crores). అలాగే ఆమె వద్ద ఉన్న ఇంగ్లీష్ Dresden డైమండ్ 78 .53 కేరట్స్ ది కూడా 736000 USD ఒక కారట్ అని వేల్యూ చేయబడింది. అంటే దాని విలువ ఇప్పుడు 491 కోట్ల రూపాయలు. అంటే కేవలం ఆమె వద్ద ఉన్న ఆ రెండు డైమండ్స్ కలిపి ఈ రోజు వేల్యూ చేస్తే 1341 కోట్ల రూపాయలు ఉంటాయి. మరియు అవి కాక ఆమెకు చెందిన ఖరీదైన ఇతర బరోడా నగలు Amsterdam లోని బంగారు వర్తకుల దగ్గర ఉన్నాయి.
సీతాదేవి 1945లో గైక్వాడ్కు సాయాజీ రావ్ గైక్వాడ్ అనే ఒక కొడుకును ఇచ్చింది. ఆమెకు ఆ అబ్బాయి అంటే ప్రాణం. ఆమె తన కుమారునికి ముద్దుగా ప్రిన్సి అని పేరు పెట్టింది.
గ్రీక్ షిప్పింగ్ Magnate అరిస్టాటిల్ ఓనాసిస్ ఆమె స్నేహితుడు. ఒనాసిస్కు అప్పట్లో పెద్ద సంఖ్యలో ఓడల సముదాయం ఉండేది మరియు ప్రపంచంలోని ఆయన అత్యంత ధనవంతులలో ఒకరిగా పరిగణించబడేవాడు. వాళ్ళ గ్రూప్ ని ఆ టైములో ఇంటర్నేషనల్ జెట్ సెట్ అని పిలిచేవారు.
1953లో ఆమె తన ANKLETS మీద వేసుకున్న వజ్రపు పట్టీలను లండన్ లో ఉన్న ప్రముఖ నగల వ్యాపారులకు విక్రయించింది. అందులో చాలా పెద్ద పచ్చలు మరియు వజ్రాలు ఉన్నాయి. ఈ ఆభరణాలను ఉపయోగించి ఆభరణాల వ్యాపారులు ఒక అందమైన నెక్లెస్ను తయారు చేసి డచెస్ ఆఫ్ విండ్సర్కు విక్రయించారు.
1957 లో డచెస్ ఆ హారాన్ని ధరించి న్యూయార్క్ లో ఒక బాల్ కి వెళ్ళినప్పుడు. బాల్ కి సీతాదేవి కూడా వెళ్ళింది. డచెస్ హారాన్ని బాల్ కి వచ్చిన వారు చాలా గొప్పగా ఉంది అని మెచ్చుకుంటూ ఉండగా, సీతాదేవి తన పాదాలమీద ఉన్నపుడు ఆ ఆభరణాలు ఇంకా అందంగా ఉండేవి అనేసింది.
డచెస్ దానితో పరాభవానికి గురి అయ్యి ఆ హారాన్ని ఆ ఆభరణాలు తనకు అమ్మిన వ్యాపారులకు కోపంతో తిరిగి ఇచ్చేసింది. సీతాదేవికి కార్లంటే చాలా ఇష్టం ఒక MERCEDES W 126 MERCEDES కంపెనీ కి ఆర్డర్ ఇచ్చి తనకు నచ్చిన విధానంలో తయారు చేయించుకుంది. అంటే ప్రపంచంలో అలాంటిది మరి ఇంకొక కార్ ఉండదు అన్నమాట. ఆమె వద్ద ఒక రోల్స్ రాయిస్ కూడా ఉండేది.
కారణం మనకు తెలియదు కానీ ఆమె 1956లో గైక్వాడ్కు విడాకులు ఇచ్చింది.
మొనాకో ప్రిన్స్ రైనర్ ఆమెకు మరియు ఆమె కుమారుడికి మొనాకో పౌరసత్వాన్ని ఇచ్చారు. విడాకుల తర్వాత కూడా ఆమె తన విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించింది మరియు చివరికి 1974 లో దానిని నిర్వహించడానికి ఆమెకు తన ఆభరణాలలో కొన్నింటిని విక్రయించాల్సి వచ్చింది.
దురదృష్టవశాత్తు, ఆమె కుమారుడు 1985లో తన 40వ పుట్టినరోజు తర్వాత మద్యపానం మరియు మాదకద్రవ్య వ్యసనాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. MR కి ఆమెకు పుట్టిన పూర్వపు కుమారుడు కూడా అతిగా మద్యం సేవించి మరణించడం ఒక విషాదం. 4 సంవత్సరాల తర్వాత ప్రిన్సీ మరణం వలన కలిగిన వ్యధతో ఆమె 1989 లో తన 72 వ సంవత్సరంలో మరణించింది.
సినిమా కథలా సాగిన ఆ సీతాదేవి జీవితం చూడండి. ఆమె వేగంగా కదులుతున్న తోకచుక్కలా జీవితంలో ప్రయాణం చేసింది. కానీ మరి అదే ఆమె స్వభావం. దాని ప్రకారమే ఆమె జీవించి మరణించింది. బహుశా ఆమె తన జీవితం అలా ఉండాలని కోరుకుంది. కానీ ఆమె ఊహించని పుత్ర మృతి వ్యధ ఆమెను చివరి 4 సంవత్సరాలు పీడించింది.
జల్లిపల్లి యుద్ధం
పద్మనాయక వెలమ చరిత్రలో జల్లిపల్లి యుద్ధం ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం 1361 లో జరిగింది.
కాకతీయ సామ్రాజ్యం తుగ్లక్ ల అధీనం ఐన తర్వాత మొత్తం ఆంధ్ర దేశం అంతా ముస్లిం పరిపాలనలోకి వచ్చింది. అప్పుడు ప్రతాపరుద్రుని మంత్రి ఆయన బెండపూడి అన్నయ యుద్ధంలో చావగా ఉన్న కాకతీయ సామంత రాజులందరిని ముసునూరి ప్రోలయనాయకుని నాయకత్వంలో ఏకం చేసాడు. అందులో కాకతీయ సైన్యాధిపతి ఐన రేచెర్ల సింగమనాయకుడు ఒకడు.
Sunday, January 5, 2025
పద్మనాయక వీరుడు గజరావు తిప్పన.
పద్మనాయక చరిత్రకారులు అందరూ 14 -15 వ శతాబ్దాలలో రాచకొండ దేవరకొండ సామ్రాజ్యాల గురించి మాత్రమేచెప్పారు. అవి కాక ఇంకా పద్మనాయక రాజ్యాలు ఏమైనా ఉన్నాయా అని నాకు సందేహం వచ్చింది.
పద్మనాయక మరియు రెడ్ల మధ్య వైరం పెదకోమటి వేమారెడ్డి.రాజ్యకాలం 1402 సంవత్సరం నుండి 1420 సంవత్సరం వరకు.
పెదకోమటి వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి పెదనాన్న అయిన మాచా రెడ్డి రెడ్డి పుత్రుడు. కుమారగిరి రెడ్డి చివరి సమయంలో రెడ్డి రాజ్యం నలువైపులా ముట్టడించబడి కల్లోలం గా ఉండటం చూసి పెదకోమటి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పద్మనాయకులు అయిన వెలుగోటి రాయప నాయక, గజరావు తిప్పనాయక ఇద్దరు కూడా అంతర్యుద్ధం లో పెదకోమటివేమ రెడ్డి తరఫున పోరాడి ఆయన సింహాసనానికి రావటానికి చాలా సాయపడ్డారు. ఇందులో వెలుగోటి రాయపనాయకుడు రెడ్డి రాజ్యానికి సామంతుడిగా ఉంటూ గుంటూరు చుట్టు పక్కల ప్రదేశాలను పాలించాడు, ఈయన సామంతుడు గజరావు తిప్పన.
గజరావు తిప్పన పెదకోమటివేమారెడ్డి తరఫున పోరాడుతూ కుమారగిరి రెడ్డి విధేయుడు, బావ అయిన కాటయవేమారెడ్డి ని ఏలూరు దగ్గర ఉన్న గుండుగొలను దగ్గర ఓడించాడు. కుమారగిరి రెడ్డి కి తనయుడు లేకపోవటం వలన ఆయన తరువాత కాటయవేమా రెడ్డి రాజ్యానికి వచ్చేవాడు. కానీ మరి కాటయవేమా రెడ్డి హరిహర రాయలు II అల్లుడు. అందుచేత హరిహరరాయలు విజయనగర సైన్యాలను పెదకోమటివేమా రెడ్డి మీదికి నడిపాడు. విజయనగర సైన్యాధిపతి అయిన చావుండప అమాత్యుడు కొండవీటివరకు రెడ్డి సామ్రాజ్యంలోనికి చొచ్చుకునిపోయాడు. అప్పుడు మరల పెదకోమటివేమారెడ్డి సైన్యాధిపతి అయిన గజరావు తిప్పన కొండవీటి పొలిమేరలలో విజయనగర సైన్యాలతో తలపడి వారిని ఓడించాడు. దాని తరువాత పెదకోమటివేమారెడ్డి కొండవీటి సింహాసనం అధిష్టించాడు.
పెదకోమటి వేమారెడ్డి తమ్ముడి పేరు కూడా మాచా రెడ్డి నే. పెదకోమటి వేమారెడ్డి ఆయనకు కృష్ణా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాన్ని ఇచ్చాడు. మాచా రెడ్డి కృష్ణా జిల్లాలోని కొండపల్లి కోటను పటిష్టం చేసి రాజధానిగా చేసుకున్నాడు.
రెడ్డి రాజ్యంలో అయిన ఈ అంతర్యుద్ధంలో కుమారగిరి ఓడిపోయి, కాటయవేమా రెడ్డి తో సహా రాజమహేంద్రవరం చేరుకున్నాడు. పెదకోమటి రాజ్యం తీసుకున్న కొన్ని సంవత్సరాల కాలం తరువాత కుమారగిరి మరణించాడు.
పెదకోమటి వేమా రెడ్డి సింహాసనం మీద నిలదొక్కుకునే సమయానికి విజయనగం సామ్రాజ్యంలో హరిహరాయలు II మరణించాడు (1404 సంవత్సరం) . సింహాసనానికి ఆయన పుత్రులైన దేవరాయలు I , విరుపాక్షరాయలు II మరియు బుక్కరాయలు II పోటీ పడ్డారు. అంతర్యుద్ధంవలన విజయనగర రాజ్యం కల్లోలం అయ్యింది. అది అదనుగా చూసుకుని పెదకోమటి వేమా రెడ్డి సైన్యాలు ఇదివరకు కొండవీటి నుండి ఆక్రమించిన ప్రాంతంలో ఉన్న విజయనగర సైన్యాన్ని ఓడించి ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
కుమారిఁగిరి రెడ్డి మరణించినా కూడా పెదకోమటివేమా రెడ్డి మరియు కాటయవేమా రెడ్డి మధ్య సంబంధాలు చెడిపోయాయి. కాటయవేమారెడ్డి, పెదకోమటివేమా రెడ్డి అధికారాన్ని ధిక్కరించి రాజమహేంద్రవరాన్ని స్వతంత్రంగా పాలించడం మొదలుపెట్టాడు. పైగా ఇప్పుడు విజయనగర రాజులూ ఆయన బావమరుదులు కదా. ఇక అప్పటినుండి కొండవీడు, రాజమహేంద్రవరం రాజ్యాలు వైరం కొనసాగించాయి. ఈ రెడ్డి రాజ్యాల మధ్య వైరం కొండవీటి సామ్రాజ్యాన్ని బలహీనం చేసింది. అలాగే రాజమహేంద్రవరం రాజ్యం కూడా బలహీనపడింది.
ఈ రాజమహేంద్రవర రాజ్య బలహీనత ను సొమ్ము చేసుకున్నవాడు మనం ఇదివరకు చెప్పుకున్న అన్నదేవ చోడుడు. ఇంతకు ముందు ఈయనకు దేవరకొండ రాజ్యం లో పెదవేదగిరి నాయకుడు ఆశ్రయం ఇచ్చాడు. ఈయన ఒకప్పుడు పాలించిన సామంత రాజ్యం రాజమహేంద్రవర రెడ్డి రాజ్యంలో భాగమే. అన్నదెవ చోడుడు దేవరకొండ సాయంతో తాను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి తీసుకోవడానికి పోరాడాడు. బహుశా దానిలో పెదకోమటి వేమా రెడ్డి కూడా అతనికి సాయపడ్డాడు.
1408 సంవత్సరంలో తన పోలవరం శాసనం ప్రకారం అన్నదేవ చోడుడు తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఏలుతున్నాడు. అంటే అప్పటికే ఆయన రాజమహేంద్రవర రెడ్డి రాజ్యాన్ని చీల్చాడు.
అప్పుడు రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం, ఒకవైపు కొండవీడు, రెండవ వైపు అన్నదేవ చోడుని రాజ్యం పక్కన ఉండి ప్రమాదంలో పడింది. కాటయవేమా రెడ్డి అది చూసి విజయనగర రాజ్యానికి వెళ్లి అప్పటికి అంతర్యుద్ధంలో గెలిచి రాజు అయిన దేవరాయ I ను కలిసాడు. అయన కాటయవేమునికి బావమరిది కదా మరి.
దేవరాయ I , తన సైన్యాన్ని తీసుకుని 1412 సంవత్సరంలో కొండవీడు రాజ్యాన్ని ముట్టడించాడు. ఆయన కొండవీటి రాజ్యంలోకి వచ్చి బాపట్ల దగ్గర ఉన్న మోటుపల్లి రేవును జయించాడు కానీ తరువాత పెదకోమటివేమారెడ్డి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అందుచేత దేవరాయ I కు ఈ దండయాత్రలో ఒరిగింది ఏమి లేదు. కాకపోతే రాజమహేంద్రవర రాజ్యానికి ఒత్తిడి తగ్గింది అంతే.
తరువాత కాలంలో పెదకోమటివేముడు తిరిగి రాజమహేంద్రవర రాజ్యాన్ని ముట్టడించాడు. ఈ ముట్టడిలో గజరావు తిప్పన చేతిలో కాటయవేమా రెడ్డి మరణించాడు. ఎందుకంటే గజరావు తిప్పనికి " కాటయ వేముని తలగొండ గండ అనే బిరుదం లభించింది. 1414 సంవత్సరం తరువాత కాటయవేమా రెడ్డి శాసనాలు కనిపించడం లేదు ఆంటే అప్పటికి ఆయన మరణించి ఉండాలి.
కాటయ వేమారెడ్డి మరణం తరువాత కుమారగిరి రెడ్డి II రాజమహేంద్రవర సింహాసనం అధిష్టించాడు. ఈయన మరణం తరువాతనే అన్నదేవ చోడుడు పెదకోమటి వేమారెడ్డి సాయంతో రాజమహేంద్రవర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కానీ అన్నదేవ చోడుడు రాజమహేంద్రవర రాజ్యాన్ని ఎక్కువ కాలం పాటు పాలించలేకపోయాడు. ఆయనను తరువాత అల్లాడ రెడ్డి ఓడించి కాటయవేమా రెడ్డి పుత్రిక ఐన అనితల్లి ని రాణిగా చేసి ఆమె తరఫున తాను రాజ్యాన్ని పాలించాడు. అన్నదేవ చోడుడు అల్లాడ రెడ్డి చేతిలో మరణించాడు.
కానీ అప్పటికి కూడా పెదకోమటి వేమా రెడ్డి కన్ను రాజమహేంద్రవర రాజ్యం మీద నుండి పోలేదు. తరువాత అయన బహమనీ సుల్తానులతో ఒప్పందం చేసుకుని వారి సాయంతో రాజమహేంద్రవరం రాజ్యాన్ని ముట్టడించాడు. బహమనీ సుల్తానులు పెదకోమటివేమ రెడ్డి తో ఒడంబడికి చేసుకొనడం రాచకొండ పద్మనాయకులకు నచ్చకపోయినా వారు ఏమీ చేయలేకపోయారు. ఈ బహమనీ, కొండవీడు ల మధ్య ఒప్పందం గురించి వెలుగోటివారి వంశావళి లో కూడా చెప్పబడింది. ఈ బహమనీ సుల్తాన్, పెదకోమటి వేమా రెడ్డి సైన్యాలను అల్లాడ రెడ్డి సమర్ధవంతంగా ఎదుర్కొని ఓడించాడు.
పెదకోమటి వేముడి మరియు బహమనీ సుల్తానుల సైన్యాలు అల్లాడ రెడ్డి తో యుద్ధం చేస్తున్న సమయంలో విజయనగర రాజు ఐన దేవరాయ I తన సైన్యాన్ని రెండు భాగాలుగా విడతీసి ఒక భాగాన్ని బహమనీ రాజ్యం మీదకు, రెండోదాన్ని కొండవీటి మీదకు పంపాడు. అప్పటికే అల్లాడరెడ్డి చేతిలో పరాజయం చెందిన బహమనీ సైన్యాలు విజయనగర ముట్టడి విని కంగారుపడి వెంటనే వెనక్కు వచ్చి "పానగల్" దుర్గాన్ని స్థావరంగా చేసుకున్న విజయనగర సేనలను ముట్టడించాయి. పానగల్ దుర్గాన్ని 2 సంవత్సరాల కాలం ముట్టడించినా కూడా అది బహమనీ సైన్యాలకు వశం కాలేదు. ఇందులో పెదకోమటై వేమా రెడ్డి కొండపల్లి రాజధానిగా పాలిస్తున్న తన తమ్ముడైన మాచా రెడ్డి ని బహమనీ సైన్యాలకు సాయంగా పంపాడు.
అప్పుడు దేవరాయ I రాచకొండ రాజ్యంతో మంతనాలు చేసి వారిని తన వైపు తిప్పుకున్నాడు. వారికీ ముందే బహమనీ కొండవీటి రాజ్యంతో ఒప్పందం చేసుకోవడం ఇష్టం లేకపోవటం వలన ఈ పని సులభం అయ్యింది. యుద్ధం జరుగుతుండగా అప్పటికి బహమనీ ల సామంతులు ఐన రేచెర్ల రాజ్య సైన్యం యుద్ధంనుండి వెనక్కు వచ్చి విజయనగర సైన్యాలతో కలిసింది. దానివలన బహమనీ సైన్యాలు ఘోరంగా ఓడిపోయాయి.
పెదకోమటి వేమారెడ్డి తన చివరి రోజులు రాచకొండ, దేవరకొండ రాజ్యాలతో యుద్ధం చేస్తూ గడిపాడు. పెదకోమటివేమారెడ్డి, మాచా రెడ్డి ఒక వైపు, దేవరకొండ నుండి కుమారమాదా నాయకుని పుత్రులైన కుమారవేదగిరి నాయక మరియు లింగమనాయక ఒక వైపు.
మాచా రెడ్డి ని కుమారవేదగిరి సంహరించి అయన రూపంతో ఉమ్మి వేసే పాత్రను చేయించుకున్నాడు. పెదకోమటివేమా రెడ్డి తిరిగి కుమారవేదగిరిని ఓడించి సంహరించి అయన చేసిన పనికి ప్రతీకారంగా అయన రూపంలో ఉమ్మి వేసే పాత్రను చేయించుకున్నాడు.
అప్పటికి లింగమనాయకునికి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఆయన పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని పెదకోమటివేముని ముట్టడించి ఓడించి అయన రూపంతో తిరిగి ఉమ్మి వేసే పాత్ర చేయించుకున్నాడు. లింగమనెడు పెదకోమటివేమారెడ్డి సింహాలాంఛనాన్ని, “నందికంట పోతరాజు కటారి” అనే అయన ఖడ్గాన్ని దేవరకొండకు తీసుకుపోయాడు. దానితోపాటు పెదకోమటివేముడుని కూడా బందీగా తీసుకుని వెళ్ళాడు. కానీ తరువాత కాలంలో పెదకోమటివేముని వదిలిపెట్టాడు. ఆలా ఎందుకు చేసాడో దానికి కారణాలు తెలియవు. తరువాత లింగమనేడు మరియు సింగయ అన్న కలసి పెదకోమటివేమారెడ్డి ని సంహరించారు. ఇది 1420 సంవత్సరంలో జరిగింది.
కుమారగిరిరెడ్డి కొండవీటి రెడ్డి రాజ్యాన్ని రెండుగా విడతీసి అది క్షీణించడానికి కారణం అయ్యాడు. అలాగే పెదకోమటివేముడు కూడా కృష్ణా నదికి ఉత్తరంగా ఉన్న రాజ్యాన్ని మాచా రెడ్డి కి ఇచ్చి తన తరువాత కొండవీటి రాజ్యాన్ని ఇంకా క్షీణించేలా చేసాడు.
పెదకోమటివేమా రెడ్డి వీరుడే కాదు ఒక పెద్ద పండితుడు కూడా. అయన సంస్కృతంలో అనేక ప్రభందాలు రచించాడు. ఈయన ముఖ్య సైన్యాధిపతి గజారావు తిప్పన. అంటే పెదకోమటివేమారెడ్డి దేవరకొండ రాజ్యంతో యుద్ధం చేసినపుడు గజారావు తిప్పన కూడా పద్మనాయకులకు విరుద్ధంగా వారితో యుద్ధం చేసి ఉండాలి. మరి ఆయన ఆ యుద్ధాలలో మరణించాడా లేదా అనేది మనకు తెలియదు.
JOGINAPALLI NRUPENDER RAO-ENTREPRENUER FROM THE VELAMA COMMUNITY
I was compiling a brief on the VIP’s of Padmanayaka Velama and in the process came across the name of Nrupender Rao garu (Joginapally Ven...
-
పద్మనాయకులు ఎటుల జన్మించారో తెలపడానికి కొన్ని కథలు ఉన్నాయి . అవి ముఖ్యంగా మూడు . కానీ ఈ గాథలు వేటికీ కూడా చారిత్...
-
1. రేచర్ల 2. దేవనూళ్ల 3. రేపాల 4. విప్పర్ల 5. విరియాల 6. అరుట్ల 7. అల్లుచెర్ల 8. సన్నగిరి (లేక) సన్నకూరు 9. సామంత రావు 10. పెంపాల 11. పైశాల...
-
The Bobbili Jamindari is currently located in the Vijayanagaram District of AP. When the Battle of Bobbili took place it was a part of the...



